జనసేన పార్టీలో చేరిన ఇంద్రపాలెం యువత

కాకినాడ రూరల్: ఇంద్రపాలెం గ్రామ కమిటీ అధ్యక్షులు అప్పారావు అధ్యక్షతన గ్రామ కమిటీ సమావేశం ఇంద్రపాలెంలో గ్రామ కార్యదర్శి సూతి శ్రీనివాస్ నివాసంలో శనివారం జరిగిన సమావేశానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని, క్రియాశీలక సభ్యత్వ కిట్లను సభ్యులకు అందించారు. స్థానిక యువనాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో 10 మంది యువత నానాజీ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మనోగతం బాగా చదివి గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనీ సూచించారు…ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, గ్రామ కమిటీ సభ్యులు, మరియు సీనియర్ నాయకులు గవర శ్రీరాములు, రమేష్, ప్రసాద్,
మణికుమార్, సురేష్, సత్యనారాయణ, రామకృష్ణ, జిల్లా నాయకులు శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య, మరియు తోట వేణు, ర్యాలీ సతీష్, రెడ్డిపల్లి కిషోర్, సత్యకుమార్, లక్ష్మణ్, సంతోష్ శరత్ తదితరులు పాల్గొన్నారు.