నడిగడ్డలో జనసేన క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ కార్యక్రమం

రాజంపేట నియోజక వర్గం, నందలూరు మండలములో.. నడిగడ్డలో జనసేన కార్యకర్తల క్రియాశీలక ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

రాజంపేట ఇన్చార్జి మలిశెట్టి ఆదేశాల మేరకు ప్రశాంత్ భారతాల ఆధ్వర్యములో నందలూరు మండలంలోని నడిగడ్డలో జనసేన కార్యకర్తల కియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమములో జనసేన కార్యకర్తలు విరివిగా పాల్గొని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యణ్ ఆంధ్రప్రదేశ్ కు 2024 లో ముఖ్యమంత్రిగా గెలిచి.. ఈ రాష్టాన్ని గాడిలో పెట్టి అప్పుల ఊబినుండి గడచ్చెంకించాలని కోరారు. ప్రజలందరు పవన్ కళ్యాణ్ సి యం కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ రైతుభరోసా కార్యక్రమానికి ముఖ్యమంత్రి అడ్డంకులు సృష్టించడమే కాకుండా.. పోలీస్ వ్యవస్థ ద్వారా జనసేన కార్యకర్తలందరికీ ఫోన్ చేసి సభకు పోవద్దనడం.. పోలీస్ స్టేషన్కు పిలవడం నిరంకుశత్వమే అని తెలియజేశారు. జనసేన ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో నడిగడ్డ జనసేన కార్యకర్తలతో పాటు, జనసేన చేనేత వికాస కార్యదర్శి రాతాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కరుణాకర్ రాజు, ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, సుండుపలె రెడ్డిరాణి, ఓబిలేషు, మరియు వియోజక వర్గంలోని ఇతరులు యం వెంకటేశ్వర రావు, బాలసాయు, బండ్లరాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు మరియు ఇతరులు పాల్గొని కాబోయే సియం పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమములో.. ఎపుడూ ముందుండి జనసేన బలోపేతానికి కృషి చేసే తాళ్ళపాక శంకరయ్య కు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.