మధిర నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మధిర నియోజకవర్గం: జనసేన పార్టీ మధిర నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షులు డేగల రామచంద్రరావు పాల్గొని.. జనసేన కార్యకర్తలు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ జరగాలని.. అదేవిధంగా పార్టీ బలోపేతం గురించి నియోజకవర్గంలోని ఇటువంటి నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని.. వివిధ పార్టీల కి జనసేన పార్టీ దమ్ము చూపి యాలని.. రాబోయే 2024 లో జనసేన పార్టీ మధిర గడ్డమీద జనసేన జెండా ఎగరాలి అని.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేయాలని.. నియోజకవర్గం కార్యకర్తలకు, నాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం మేడబోయిన కార్తీక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిట్ నెంబర్ నాగ సాయి, సత్యం, నియోజకవర్గ నాయకులు తాళ్లూరిడేవిడ్, మోదుగు సైదులు, బడుగుల వీరబాబు, సోషల్ మీడియా నాయకులు సజ్జనపు భరత్, అద్దంకి సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.