గుత్తి పట్టణంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లకు జిల్లా జనసేన నాయకులుచే ఘనంగా సన్మానం. అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి పర్యవేక్షణలో, గుత్తి మండల అధ్యక్షుడు పోతురాజుల చిన్న వెంకటేశులు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, లీగల్ సెల్ అధ్యక్షులు మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి చెప్పా చంద్ర మరియు సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో నిస్వార్థ జనసైనికులు, నాయకులు పాటిల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, మాగిశెట్టి సురేష్ కుమార్ లు అత్యధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించినందుకుగాను వారిని ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసైనికులు నాయకులు, పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.