పామూరులో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను ఈనెల 10వ తేదీ 11వ తేదీ 12వ తేదీ లలో అన్ని మండలాల పరిధిలో పంపిణీ చేయాలని జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం 12వ తేదీన పామూరు మండలంలో కిట్లను పంపిణీ కార్యక్రమం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రహీముల్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో 500 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద భీమా లభిస్తుందని ఇది ఆ కార్యకర్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకురా నటువంటి పథకాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యకర్తల శ్రేయస్సుకోసం ఈ ప్రమాద బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేసినటువంటి వాలంటీర్లకు శాలువాతో సత్కరించి వారికి ప్రశంసాపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై.రహీముల్లా, పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, గోస్టు సునీల్, గుత్తి మహిత్, అఖిల్, మహి, సాయి, నారాయణ, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.