హైదరాబాద్ లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

హైదరాబాద్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకుల సూచనలతో గ్రేటర్ హైదరాబాద్ లో కూకట్పల్లి నియోజకవర్గంలో గ్రావిటి హోటల్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం ముఖ్య అత్ధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు చేసినందుకు తుమ్మల మోహన్ కుమార్ ని ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గాంలో క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లను వాలంటీర్ల చేతుల మీదుగా క్రియాశీలక సభ్యులకి పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.