రాయుడుపాలెం ప్రాంతంలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెం ప్రాంతంలో జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని కిట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు బైక్ ర్యాలీతో, గజమాలలతో, పుష్ప గుచ్చలు, హరతులుతో పంతం నానాజీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం నానాజీగారు తాటికాయల వీరబాబు ఏర్పాటు చేసిన జగన్ పాలనలో-జనం కష్టాలు అనే శీర్షికతో కరపత్రాల ప్యాకెట్ ను రిబ్బన్ కట్ చేసి, ప్రజలకి, ఇంటింటికి పంపిణీ చేసారు. అదేప్రాంతంలో సుమారు 50మంది మహిళలు, పురుషులు నానాజీ సమక్షంలో జనసేన పార్టీ జాయిన్ అయ్యారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి శుభాకాంక్షలు తెలియచేసారు. వారందరికీ కిట్ల అందించారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, శిరంగు శ్రీను, జగన్, సునీల్ ముసలయ్య చిన్నారావు, బాబీ, అమరాదిరము, బాబీ తదితర నాయకులు పాల్గొన్నారు.