పోరెడ్డి ప్రశాంత్ ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వ కిట్లు, బీమా పత్రాల పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు పోరెడ్డి ప్రశాంత్ ఆధ్వర్యంలో సోమవారం పాలకొండ మండలంలోని తుమరాడ నవగం సెంటర్లో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 లక్షల బీమా పత్రాలను, క్రియాశీలక సభ్యత్వ కిట్లను జనసేన పార్టీ కార్యకర్తలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోరెడ్డి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చెయ్యని సహాయాన్ని.. అధికారంలో లేకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు 30 కోట్లుపంచి పెట్టడం అనేది దేశ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేదని వివరించడం జరిగింది. ఈ సారి గాజు గ్లాస్ కు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్నూరు రమేష్, కడగల హరికృష్ణ, గోర్ల మన్మధ తదితరులు పాల్గొన్నారు.