మాడుగులలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

జి.మాడుగుల, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ సందర్బంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన ప్రతి జనసైనికులకు, నాయకులకు ఇన్ఛార్జ్ డా..వంపురు గంగులయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో జనసేనకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం మోసపోయిన నేరమయ రాజకీయ నాయకులతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కోరుకుంటున్నారు. ఒక వైపు రైతుల నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజలు నిరుద్యోగుల వరకు వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది జాతీయ మీడియా ఇండియా టుడేలో వెలువడిన కధనమే గొప్ప అయితే జనసైనికులకు నా మనవి ఏమిటంటే జనసేన సిద్ధాంత సైద్ధాంతిక విలువల విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఏ రాజకీయ పార్టీలు పోటీ పడలేవు అలాగే గొప్ప యువశక్తి కలిగిన పార్టీ జనసేన. ప్రతి జనసైనికుడు తెలుసుకోవాల్సిన వాస్తవం, ఆచరించాల్సిన నిజం ఏమిటంటే ఒకప్పుడు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ మనకు ఆరాధ్య దైవం సందేహమే లేదు కానీ ప్రతి అభిమాని సగటు అభిమాని నుంచి రాజకీయవిలువలు వ్యూహాలు, సామాజిక బాధ్యత, ప్రజల ఆదరాభిమానాలు ఎలా పొందాలి అనే విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ గొప్ప జనసైనికుడుగా రూపాంతరం చెందాలి. ప్రజల్లోకి వెళ్లి అధికారంలో ఉంటూ పదవుల్లో ఉన్న నాయకులు చెయ్యలేనటువంటి పనులు ఏ పదవి లేని జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కానీ ఏ ప్రింట్ ఎలాక్ట్రాన్ మీడియాలకి వార్తలు కావు, రావు. అందుకే క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమౌతూ గొప్ప చైతన్య తీసుకు రావడమే జనసైనికుల మొట్ట మొదటి బాధ్యతని జనసైనికులనుద్దేశించి చెప్పారు.