జనసేన ఆద్వర్యంలో గిరిజనులకు భోజనం పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో మనుబోలు మండలం బద్వేల్ రోడ్ లోని సంగమేశ్వర గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న పేద గిరిజనులకు సోమవారం మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది. అకాల వర్షాలతో చేతిలో పనులు లేక పూట గడవడం కష్టంగా ఉండటంతో వారికి ఈ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చే పార్టీ ఒక్క జనసేనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాకీర్, నయుమ్, సందీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.