తొత్తరమూడి పెదలంక వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

పి.గన్నవరం, అయినవిల్లి మండలం తొత్తరమూడి పెదలంక అనే గ్రామంలో వరదలు వచ్చి మొత్తం నీట మునిగిపోయింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. అక్కడి ప్రజల కష్టాలు చూస్తే చాలా బాధాకరం కలిగి తోచిన సహాయం అంటే కూరగాయలు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.