వరద ప్రాంతాల్లో వేగుళ్ళ లీలాకృష్ణ సహాయక కార్యక్రమాలు

  • 800 మంది బాధిత కుటుంబాలకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ.

మండపేట, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కపిళేశ్వరపురం మండలం అద్దంకివారిలంక ముంపు ప్రాంతాల్లో శుక్రవారం మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పర్యటించారు. గ్రామంలో 800 మంది కుటుంబాలకు 5కేజీల బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా లంకలన్నీ వరద ముంపులోనే ఉన్నాయన్నారు. వారిని ఆదుకోవడానికి వేగుళ్ళ లీలాకృష్ణ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి సహాయక చర్యలు చేపట్టారు. పంటలు నష్టపోవడంతో కన్నీరు మున్నీరైన రైతులు తమ గోడును ఆయనకు వినిపించారు. అద్దంకివారిలంకలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగి దిక్కు తోచని స్థితిలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.