జనసేన పార్టీ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

బోనకల్ మండలం: అందరికీ విద్య అందరి బాధ్యత అనే నినాదంతో రాకేష్ సహకారంతో మధిర నియోజకవర్గం నాయకులు తాళ్లూరి డేవిడ్, మండల నాయకుల ఆధ్వర్యంలో.. బోనకల్ మండలంలో వివిధ గ్రామాల్లో బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. పేదరికంతో చదువుకి ఇబ్బంది పడే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మా యొక్క సహకారం.. జనసేన పార్టీ సహకారాలు ఎప్పటికీ అందిస్తూనే ఉంటామని.. ముందు ముందు విడతలవారీగా మండలం లో గల వివిధ పాఠశాలల్లో నోట్ బుక్స్, బాగ్స్, ఫుట్ వేర్, టాలెంట్ టెస్టులు, స్కాలర్‌షిప్‌లు, ప్రతిభగల విద్యార్థులకు నగదు రూపంలో ప్రోత్సాహంగా అందిస్తామని.. అదేవిధంగా తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని.. చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వింగ్ నాయకులు వేముల వినయ్ కుమార్, సోషల్ మీడియా నాయకులు భరత్ సాకేత్, మండలం నాయకులు అశోక్, రమణ, అద్దంకి సంతోష్ సాయి, ఎస్ కె బాజీ బాబా, అర్వపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.