పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలి: జనసేన డిమాండ్

మైలవరం స్థానిక మారుతి కళ్యాణ మండపం ప్రక్కన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక యార్డ్ వద్ద గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. మైలవరం నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ్మోహనరావు(గాంధీ) పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి పేద వాడికి ఉచితం ఇసుక ఇస్తామని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, జిల్లాప్రోగ్రాం కోఆర్డినేటర్ కమిటీ మెంబర్ పురమ సతీష్, ఎంపీటీసీ తేజ, మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు మురళీకృష్ణ, చిరంజీవి, ఆకుతోట ఈశ్వర్, కూసుమంచి కిరణ్ కుమార్, మాదినేని చిన రామారావు, మల్లారపు దుర్గాప్రసాద్, సి.హెచ్.వెంకట కృష్ణ, ఆనం విజయ్, పసుపులేటి నాగరాజు, ఉయ్యూరు నాగరాజు, ఈతకొట్టు నాని, క్రియాశీలక సభ్యులు అన్నవరపు రమేష్, పార్టీ ఆఫీస్ మేనేజర్ రమేష్ బాబాయ్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.