జనసేన పార్టీ రైతు సభకు భారీగా తరలి రావాలని కరపత్రాల వితరణ

జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య అదేశాలు మేరకు ఈ నెల 16వ తేదీన జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామంలో జరుగు జనసేన పార్టీ రైతు సభకు ప్రజలు అందరు విచ్చేసి జయప్రదం చేయాలని సంత బయలులో సభ యొక్క కరపత్రాలు పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడేరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నందోలి మురళి కృష్ణ, ఉపాధ్యక్షుడు సాలేబు అశోక్, సోషల్ మీడియా వింగ్ కీల్లో అశోక్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.