ఏపీలో రేపటి నుంచి సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ

ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి సెప్టెంబర్ నెల పింఛన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్దం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 61.68 లక్షల మందికి పించన్లు పంపిణీ చేయనుండగా.. ఈ నెల కొత్తగా మరో 90,167 మందికి కూడా పించన్లు ఇవ్వనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుంచి జియో ట్యాగింగ్ ఫొటోలు తీసుకుంటున్నారు. ఫించన్ల పంపిణీ కోసం రూ.1496.07 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. కాగా, రేపు గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్దిదారుల చేతికి పించన్లు అందిస్తారని స్పష్టం చేశారు.