జనసేన పార్టీలో చేరికలు మరియు క్రికెట్ టోర్నమెంట్

నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, ముసలిమడుగు గ్రామంలో శుక్రవారం జనసేన పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం నాయకులు నల్లమల్ల రవికుమార్ టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అలాగే నూతన జనసైనికులు జనసేన పార్టీలో చేరాలని ఆశతో ఉన్న ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం నల్లమల రవికుమార్, విష్ణు మరియు పెరుమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమల్ల రవికుమార్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు బాగుపడాలంటే 2024లో జనసేన పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావాల్సిందే అని తెలిపారు. మరియు జనసేన పార్టీ అధికారంలోకి రావడం వల్ల రైతు కుటుంబాలు సంతోషమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడం జరిగింది. జనసేన మధు మాట్లాడుతూ యువత జనసేన పార్టీ బలోపేతానికి ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి బి.మధు, మొలక శేషు, కాకర్ల కిరణ్, పగడం శేషన్న, కర్నాటి మల్లికార్జున, ప్రవీణ్ ముసలిమడుగు జనసేన నాయకులు గఫర్సాహెబ్ ఇక్బాల్, విష్ణు, వెంకీ, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొనడం జరిగింది.