జనసేన యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కిక్రెట్ టోర్నమెంట్

ఇనపరాజుపల్లి గ్రామంలో జనసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కిక్రెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిధిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా అంకారావు మాట్లాడుతూ… యువతీ యువకులకు విద్యతో పాటుగా క్రీడలు చాలా అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తానయని ఆయన అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ఆయన కోరారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి గొడవలకు తావు లేకుండా, పోటీలు నిర్వహించాలని కమిటీ సభ్యులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ కార్యదర్శి బుసా రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి దుదేకుల ఖాసీంసైదా, కారంపూడి మండల అధ్యక్షులు కృష్ణబాబు, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, కారంపూడి మండల చిరంజీవి యువత అధ్యక్షులు ఎస్.ఎం.కె నాయుడు, కమిటీ సభ్యులు తేజ, గోపితో పాటుగా గ్రామపెద్దలు పాల్గొన్నారు.