ప్రత్తిపాడు నియోజకవర్గం, నగరపాలక సంస్థ 16వ వార్డులో జనసేన కిట్ల పంపిణీ

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, నగరపాలక సంస్థ పరిధిలోని 16వ వార్డు మొట్టమొదటి జనసేన పార్టీ కార్పొరేటర్ అందులోనూ మహిళ కార్పొరేటర్లలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించినటువంటి శ్రీమతి దాసరి లక్ష్మీ దుర్గ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా వార్డు పరిధిలోని బుడంపాడు గ్రామంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెద్ద ఎత్తున బుడంపాడు గ్రామ జనసేన విభాగం ఆధ్వర్యంలో జన్మదినోత్సవ కేక్ కటింగ్ మరియు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నా ప్రాణ సమానులైన జనసైనికుల కోసం, వారి కుటుంబాలకు కొంత ధైర్యాన్ని చేకూర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ నా చేతుల మీదుగా నిర్వహించడం, అదేవిధంగా చాలా చక్కగా ఘనంగా నా జన్మ దినోత్సవ వేడుకలు బుడంపాడు ప్రజలు మరియు జనసైనికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నా వార్డు ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని అందించినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు నాయకులు దాసరి వాసు, విష్ణు మొలకల ఆంజనేయులు, ఆకుల వీరరాఘవయ్య, మారిశెట్టి వెంకటేశ్వరరావు, మన్నేస్వాములు, కుర్రా రవి, లింగాల నాంచారయ్య, చింతా పార్ధసారధి, పావులూరి కోటేశ్వరరావు, దాది ఆంజనేయులు, చక్కా అంజి,కోటయ్య, కృష్ణ మోహన్, వేలూరి గోపి, నాగరాజు, మణి, గోపి, రమణ, వెంకటేశ్వరరావు, అంజి మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.