ప్యాకేజీ అని మొరగటం కాదు జోగి మంత్రిగా నీ బాధ్యతను నెరవేర్చు

పెడన, పనిచేయటం చేతకాక, తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించడంలో విపులమైన దద్దమ్మ కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం హాస్యాస్పదం. గృహ నిర్మాణ శాఖామంత్రి అని చెప్పుకునే జోగి రమేష్ తన నివాసానికి కూతవేటి దూరంలో జగనన్న కాలనీలో ఎలాంటి వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. అప్పులు చేసి, ఉన్న బంగారాన్ని అమ్ముకుని కష్టపడి కట్టుకున్న ఇంట్లో మౌళిక వసతులు లేకపోవడం వలన అక్కడ ఉండలేక కొందరు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అద్దెని భరించలేని సామాన్యులు, నిరుపేదలు అక్కడే నివాసం ఉంటూ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. రాత్రి అయితే విద్యుత్తు లేక కాలనీ మొత్తం చీకటిమయం. బయటికి రాలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద మొరగడం తప్ప పనికిరాని, పని చేతకాని మంత్రి జోగి రమేష్ ఇప్పుడైనా కళ్ళు తెరువు. చేతనైతే సమస్యలు పరిష్కరించు లేదా నేను అసమర్ధుడిని అని ఒప్పుకోమని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.