పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న మంత్రి రాజీనామా చేయాలి – అనకాపల్లి జనసేన

◆ జనసేన నాయకుల డిమాండ్
◆ అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా
◆ అమర్ నాథ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

అనకాపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ తక్షణమే రాజీనామా చేయాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జనసైనికులు శ్రీరామదాసు గోవింద, తాడి రామకృష్ణ, దూలు గోపి, మళ్ళీ తీసు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే అనకాపల్లి అభివృద్ధిపై నాలుగురోడ్ల కూడలి వేదిక చర్చకు రావాలని సవాల్ విసిరారు. గుడివాడ అమర్నాథ్ ని తిరిగి తన సొంత నివాసమైన మింది పంపేంత వరకు తామంతా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం గుడివాడ అమర్ నాథ్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత వరకు పోలీసులకు, జనసైనికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో తాకాశి సత్యం దొర, భర్నికాన రాము, పీజే హరీష్, గొల్లవిల్లి రాజు, పెద్దాడ సాయి, మళ్ళీ వంశీ. కె.లక్ష్మణ్, వరహాలరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.