డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 12వ వారం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం నందు గత 11 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కేంద్రం 12వ వారం కార్యక్రమంలో భాగంగా శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి 750 మందికి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, అల్లం వాసు, పొట్లూరు గణేష్, అల్లం రాజు, ఇప్పర్తి శీను, జ్యోతుల నాన, వెదురుపాక దుర్గాప్రసాద్, తదితరులు తమ సేవలను అందించారు. వీరిని చరవాణి ద్వారా జ్యోతుల శ్రీనివాసు ప్రశంసిస్తూ.. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమునకు అనేకమంది ఈ విధంగా తమ సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.