డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 13వ వారం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, జ్యోతుల శ్రీనివాస్ జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము వారు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం నందు గత 12 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా
13వ వారమైన ఈ శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి 780 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు జనసేననాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వయంగా అన్నపానీయాలను రైతులకు, పశువుల అమ్మకం మద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సీతారాంబాబు, కీర్తి చిన్న, పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లంవాసు, యర్రం చంద్రరావు, విప్పర్తి అప్పారావు, బావిశెట్టి శ్రీనివాసు, అల్లం శ్రీను, ఇప్పర్తి శీను, జ్యోతుల నాని, వెదురుపాకదుర్గాప్రసాద్, తదితరులు తమ సేవలను అందించారు. స్వయంగా జ్యోతుల శ్రీనివాసు శ్రమదానం చేస్తూన్నావారిని ప్రశంస్తూ.. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమునకు అనేకమంది ఈ విధంగా తమ సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.