3వ రోజు డిజిటల్ క్యాంపెయిన్ లో కంచికచర్ల జనసేన

కంచికచర్ల: జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు.. కృష్ణ జిల్లా అధ్యక్షుడు బండ్రేది రామకృష్ణ సూచనలు మేరకు.. ఆదివారం కంచికచర్ల మండలం పరిధిలో 3వ రోజు రోడ్లు డిజిటల్ క్యాంపెయిన్ బతినపడు గ్రామంలో కంచికచర్ల మండల జనసేన పార్టీ అధ్వరంలో జరిగింది. #GoodMorningCMSir కార్యక్రమంలో కంచికచర్ల జనసైనికులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కంచికచర్ల మండల ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి అజయ్ బాబు మాట్లాడుతూ.. మండల పరిధిలో 16 గ్రామంలో ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లు పడిన గుంతలు నిండా నీళ్ళు చేరి చెరువులను తలపిస్తున్నాయని.. అదే విధంగా జగన్ రెడ్డి గారికి ఉచిత పథకాల మీద.. మరియు వల్ల నాన్న సమాధి.. పంచాయితీ రాజ్ లకు రంగులు వేయటం మీద ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధి మీద లేదు అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల సంయుక్త కార్యదర్శిలు కుసునురి నరసింహారావు కొట్టారి దేవేంద్ర, అలాగే మండల నాయకులు పేదినేడి హరిబాబు, వనపర్తి, పద్మారావు పుప్పాల వేణుగోపాల్ కురా నాని తదితరులు పాల్గొన్నారు.