దమ్మాలపాడులో జనసేన జెండాను ఆవిష్కరించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో సోమవారం ముప్పాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో దమ్మాలపాడు గ్రామంలో ఘనంగా నూతన జనసేన జెండా ఆవిష్కరణ అలాగే ఇంటింటికి పవనన్న ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులుబొర్రా వెంకట అప్పారావు పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను పార్టీ మేనిఫెస్టోలో కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి చేరడం జరిగినది. దమ్మాలపాడు గ్రామ జనసైనికులు బొర్రా అప్పారావుకు భారీ గజమాల వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం గ్రామంలోని నూతన జెండాని ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు, కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ మెంబర్స్, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.