డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 7వ వారం

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పశువుల సంత వద్ద జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం నందు గత 6 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం 700 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పిటల్స్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, స్వచ్ఛగొల్లప్రోలు వారు, అల్లం శ్రీను, రెడ్డి మనోహర్, బస్సా శ్రీకాంత్, జ్యోతుల నాని, ఇప్పర్తి శీను, కీర్తి చిన్నా, కోలా నాని, జీలకర్ర భాను తదితరులు తమ సేవలను అందించారు. వీరిని చరవాణి ద్వారా జ్యోతుల శ్రీనివాసు ప్రశంస్తూ.. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమునకు అనేకమంది ఈ విధంగా తమ సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.