జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం

విశాఖ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కెజిహెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జనసేన పార్టి సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(జీకె) చేతుల మీదుగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన వారు, ఆర్.పి రాజు అలాగే మచ్చ రాజు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసైనికులు అరుణ్, గణేష్, ఎలకా పాపారావు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.