టీడీపీ నిరసన దీక్షకి దోమకొండ అశోక్ సంఘీభావం

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పు నియోజకవర్గం, 7వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన నిరసన దీక్షకి జనసేన పార్టీ ఆదేశానుసారం 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ దీక్షలో 7వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దోమకొండ మేరీ గారు మరియు జనసేన నాయకులు మొగదల సుజాతా రావు, రాజేశ్వరి, శ్రీలక్ష్మి, కళ్యాణి, అనిల్, సాది రెడ్డి శ్రీను, బండి ప్రదీప్, సాయి మోహన్, శ్రీనివాస్, మధు, నరేష్, రవి, శ్యామ్, రమేష్, మరియు జనసేన పార్టీ డివిజన్ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది.