మసీదు నిర్వహణ, మరమ్మత్తుల నిమిత్తం గంగారపు రామదాస్ చౌదరి విరాళం

మదనపల్లె: జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి మదనపల్లె రూరల్ మండలం, పోతబోలులో మసీదు నిర్వహణ మరియు మరమ్మత్తులు నిమిత్తం రంజాన్ పండుగ సందర్భంగా రంగులు వేయడానికి రూ.10 వేల రూపాయలు విరాళంగా ముస్లిం మత పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మసీదుల అభివృద్ధి కోసం ఇటీవల రూ.25 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన స్పూర్తితో తన వంతు సాయంగా పోతబోలు మసీదు నిర్వహణ కోసం రూ.10 వేలు విరాళం ఇవ్వడం జరిగిందని వివరించారు. మసీదు మత గురువులు మహమ్మద్ ఫుర్ కాన్, కార్యదర్శి హదర్ ​​సాబ్, ముతవల్లి షంషీద్, ఆధామ్ సాబ్, మహబూబ్ బాషా, సాదిక్, హైదర్ వలిలకు రూ.10 వేలు అందజేశారు.‌ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం జగదీష్, జిల్లా కార్యదర్శి సనా ఉల్లా, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, కుమార్, రెడ్డెమ్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.