బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేసిన మహా పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విఆర్ సెంటర్ నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేసిన మహా పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశంలో ఉన్న అప్పటి అసమానతలు రూపుమాపేందుకు కృషిచేసిన స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ రూపకర్త, సామాజిక అభివృద్ధి కోసం పోరాటం చేసిన వీరుడు స్మరిస్తూ జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో మనకున్న హక్కులనే కాక పౌరులు చేయాల్సిన విధులు, బాధ్యతలు గుర్తు చేసిన మహనీయుల బాటలో ప్రయాణిస్తూ ఆయన ఉన్నత ఆశయమైనట్లు అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా పనిచేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా నాయకులు కొణిదల నాగబాబు, వేములపాటి అజయ్, నాదెండ్ల మనోహర్ బాటలో ప్రయాణిస్తూ జనసేన పార్టీ ఆశయాలను ప్రజలకు చేర వేసే విధంగా కష్టపడి ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కు మద్దతు పలకాలని తెలియజేస్తూ మహా పురుషునికి ఘన నివాళులర్పిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వర, మౌనిష్, కేశవ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సిటీ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, ఖలీల్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.