వంగవీటి రాధాను కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను జనసేన ఉమ్మడి చిత్తూరు జిక్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన్ని కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాపు సామాజిక వర్గ అభివృద్ది, రాజకీయాల్లో కాపుల పాత్రపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. జనసేన, టిడిపి పొత్తు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి.