దక్షిణలో డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు వార్డులలో ఆయన ఈసేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. బుధవారం ఉదయం 35వ వార్డులో నవ వధువు జయంతికి తల్లిదండ్రులు అక్కమ్మ, సోలాపూర్ సమక్షంలో బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలను అందజేశారు. అలాగే 33వ వార్డు కుమ్మరి వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి చేర్చిత కుటుంబానికి అండగా నిలిచారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, కృష్ణలకు సాయం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పట్టు బట్టలను అందజేశారు. ఇలా నియోజకవర్గంలో నిరంతరం ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ తాను సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రజాసేవ లక్ష్యంగా తాను ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, త్రినాధ్, రఘు, తరుణ్, ప్రవీణ్, శ్రీను, గాజుల శ్రీను, మంగ, అరుణ, లలిత, రాజేశ్వరి, హేమ, వెంకట, కుమారి తదితరులు పాల్గొన్నారు.