కలువాయి జనసేన ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా

వెంకటగిరి నియోజకవర్గం, కలువాయి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు పాటిస్తూ.. భగవంతుని ప్రార్ధనలు చేస్తూ.. నెలరోజులు కొనసాగే ఉపవాసాల ప్రక్రియకు ముస్లిం సోదరులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పేద ముస్లింల కళ్ళల్లో ఆనందం నింపాలని కలువాయి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి బుధవారం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసైనికులు ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తారని, 50 మంది పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి వారికి కలువాయి మండల జనసైనికులు ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం జరిగిందని తెలియజేసారు. మతాలను గౌరవించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ముందుకు పోతూ.. సేవలందించడానికి జనసైనికులు ఎప్పుడూ ముందుంటారని మసీదు కమిటీ సభ్యులు నూరిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకు రామకిషోర్, నరేష్, శ్రీరామ్ వెంకటపతి, శ్రీరామ్ మనోహర్, భువన్, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.