జనసేన జెండా ఆవిష్కరించి మెగా ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

పిఠాపురం, జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు సమక్షంలో జనసేన జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మెగా ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని 2024 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ పిల్లా దీపికలు తెలియజేశారు. పిఠాపురం మండలం బి.పత్తిపాడు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక పర్యటించారు ముందుగా బి. పత్తిపాడు గ్రామస్తులు జనసేన నాయకులతో కలిసి రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార విభాగం నాయకుడు కంబాల దాసు చేతుల మీదుగా జనసేన జెండాను ఆవిష్కరించారు అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక గ్రామంలో పర్యటిస్తూ జనసేన పార్టీకి మద్దతు తెలియజేయాలని ప్రజల్ని కోరారు అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ పిల్లా దీపిక నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక రోగులను పరిశీలించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కాగా సుమారు 1000. మందికి ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గరగ సత్యానందం, దుడ్డు రాంబాబు, బొజ్జ గోపాలకృష్ణ, బొజ్జ బుల్లిరాజు, పేర్నిడి చక్రనారాయణ, సానా మరిడియా, చోడిశెట్టి లచ్చన్న, బొజ్జ అయ్యరాజు, ఊట రాంబాబు, పెనుబోతుల శివ, బొజ్జ శివ, ఊట శీను, పల్నాటి మధు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, మైలపల్లి రాజు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.