గొల్లమారమ్మతల్లి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ముమ్మిడివరిపాడు గ్రామం నందు నూతనంగా ప్రారంభించబడుతున్న గొల్లమారమ్మతల్లి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరీగంది. గొల్లమారమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి గుడి నిర్మాణం నిమిత్తం 10116/- రూపాయలు అందించడం జరిగింది. అనంతరం గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన ముఖ్య అతిథులు జనసేన నాయకులు అయినటువంటి డాక్టర్ పిల్లా శ్రీధర్ గారిని గ్రామ పెద్దలు గుడి కమిటీ సభ్యులు మరియు జనసైనికులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ రాయి రమేష్, ముమ్మిడి వెంకట్రావు, బండి పెద్దకాపు, బండి సీతయ్య కాపు, ముమ్మిడి రామ గోవిందు, ముమ్మిడి సీతారాం, ముమ్మిడి చిన్నారావు, బండి అప్పారావు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.