దత్త జయంతి సందర్భంగా వన్నెపూడి గ్రామం నందు దత్త దేవుని సన్నిధిలో డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గంలో వన్నెపూడి గ్రామం నందు దత్త జయంతి సందర్భంగా దత్త దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమంలోనూ అన్నదాన కార్యక్రమాల్లోనూ కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ దత్త దేవుని దర్శించుకుని 5116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకుని అన్నదాన కార్యక్రమం నిమిత్తం 1116/- రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొయిల్లా నాగబాబు, దొడ్డిపట్ల దత్త చల్లారావు, మొయిల్లా నాగబాబు, గొల్లపల్లి రాజారావు, మొయిల్లా సూర్య చక్రరావు, దొడ్డిపట్ల సత్తిబాబు, నక్క బాబి, ఎర్ర సతీష్, పత్తిపాళ్ళ శివ, పత్తి పళ్ళ సత్తిబాబు, గొల్లపల్లి కృష్ణార్జున, దొడ్డిపట్ల వీర కృష్ణ, మరియు జన సైనికులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.