జగ్గయ్య చెరువు ను మోడ్రన్ జగ్గయ్య చెరువుగా తీర్చిదిద్దుతా: మాకినీడి

  • రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా 8వ రోజు ఇంటింటికి జనసేన

పిఠాపురం: రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి 8వ రోజు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి స్థానిక పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువులో పర్యటించి.. స్థానికుల సమస్యలు, వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు వారికి ఉన్న రోడ్డు, కుళాయి, వీధి దీపాలు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం విశేష స్పందన లభిస్తుందని ఆన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మూడున్నర సంవత్సరాలు పైగా ఈ ఇబ్బందులు అనుభవించిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన చూస్తున్నారని ఇది జనసేన గెలుపుకు శుభ సూచకమని ఆమె అన్నారు. జగ్గయ్య చెరువు ప్రజలు వారికున్న మురుగు నీటి సమస్య గురించి వివరించారు. సమస్యపై ఆమె మీడియాలో స్పందిస్తూ మున్సిపాలిటి సిబ్బందిని, మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఆమె ప్రశ్నించారు, ప్రజల ఓట్లతో గెలిచింది కుర్చీలో కూర్చోవడానికి కాదు అని, వారికి వున్న సమస్యలు పరిష్కరించి, వారికి సేవ చేయడానికి మిమ్మలని అందలం ఎక్కించారు అని అన్నారు. వీరికి ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి, గోపు సురేష్, బుర్ర సూర్య ప్రకాష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, కంద సోమరాజు, వినుకొండ అమ్మాజీ వినుకొండ శిరీష, నక్క నారాయణమూర్తి, దుర్గాప్రసాద్, శ్రీను, ఆంజనేయులు, జన సైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.