జనసేనాని జన్మదిన వారోత్సవాల్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసైనికులు సెప్టెంబర్ రెండవ తేదీన జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని చేబ్రోలు జనసైనికులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలో భాగంగా మూడవరోజు సోమవారం పిఠాపురం నియోజకవర్గం గవర్నమెంట్ హాస్పటల్ నందు రోగులకు, వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాలుపంచుకున్నారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో చేబ్రోలు జనసైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాలో భాగంగా ప్రతీ రోజు ఒక సేవా కార్యక్రమం చేపట్టడం చాలా మంచి విషయమని చేబ్రోలు జనసైనికులను ప్రశంసించడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా మీకు కుదిరినప్పుడల్లా ఎంతోకొంత సేవనందించాలని చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రతి జనసైనికుడు ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ అంటేనే ప్రజలకు సేవ చేసే పార్టీ అని జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుద్దాల చంటిబాబు, పెద్దింటి శివబుద్దాల గంగాధర, మంగం జానుప్రసాద్, కర్నీడి గోపాల్, కందా బుజ్జి, ధూళిపూడి బుజ్జి, బదిరెడ్డి శివ, కర్రి నాగేంద్ర, ధూళిపూడి జయ, బావిశెట్టి దత్త, నందిపాటి పవన్, బదిరెడ్డి అరవింద్, పిరమళ్ళ శివసాయి,ధూళిపూడి రాజా, చేదులూరి మణి, చేదులూరి శ్రీను, చేదులూరి అర్జున్, కుక్కులూరి నారాయణమూర్తి, బండిరాజు, చేదులూరి శివ, సఖినాల వీరవాబు, కొసిరెడ్డి సురేష్, శాఖా సురేష్, రాజా, కాశీ, చిట్టిబాబు, తలాటం లోవయ్యా, సఖినాల మణికంఠ, సతీష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.