శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పూజాజ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామం నందు శ్రీ శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చితుర్ వింశాంతి (24వ) సప్తాహ మహోత్సవంలో భాగంగా పల్లపు వీధి వారి ఆహ్వానం మేరకు శ్రీ ఉమా రామలింగేశ్వర భజన సమాజం తరపున పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా శ్రీమతి డాక్టర్ రత్న దీపిక దంపతులచే పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, కొప్పల చక్రధర్, బండి అప్పారావు, కొండేకలపూడి గంగాధర్, ఇంటి గిరి, మొగిలి శ్రీను, ఇంటి ప్రసాద్, పర్వతపు బాబ్జి, మరియు నియోజకవర్గ జనసైనికులు కార్యకర్తలు వీర మహిళలు నాయకులు గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.