జనసేన పార్టీ బలోపేతం దిశగా డాక్టర్ పిల్లా శ్రీధర్

  • జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న కొమరగిరి యువత

పిఠాపురం నియోజకవర్గం: కొమరగిరి గ్రామం నందు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కొమరగిరి గ్రామంలో బలమైన నాయకులతో భేటీ అయ్యి అక్కడ జనసైనికులు, నాయకులతోను మాట్లాడి అందరూ కలిసి పార్టీ బలోపేతానికి పనిచెయ్యాలని చేయాలని ఇక్కడ సమావేశమైన ప్రతి జనసైనికులు వారి యొక్క కుటుంబాలు బంధుత్వాల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా కొమరగిరి జనసైనికులకు నాయకులకు పార్టీ అండగా ఉంటుందని దానికి మీకు ఏ సమస్య వచ్చినా గాని నేను మీకు అన్నగా మీ ముందు ఉంటానని డాక్టర్ పిల్లా శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. త్వరలోనే జనసేన పార్టీలోకి కొమరగిరి నుంచి అనేకమంది యువత జనసేన పార్టీలోకి చేరికలకు సిద్ధంగా ఉన్నారని త్వరలోనే జనసేన పార్టీలోకి చేరికలకు సన్నహాలు సిద్ధం చేయడం జరుగుతుందని మీరందరూ జనసేన పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉండడం చాలా సంతోషకరమైన విషయమని మీరు చూపించే అభిమానానికి డాక్టర్ పిల్లా శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందరావు ఉలవల శ్రీను, రాసంశెట్టి లోవ బాబు, దాసరి దుర్గారావు, ఎస్ వి ఎస్ ఎన్ మూర్తి, ఎం శ్రీనివాస్, మేకల లోవబాబు, మేక కిరణ్, ఆరవ మణికంఠ, మరిశెట్టి సూర్యచంద్ర, దాసరి సురేంద్ర, కుప్పల కృష్ణమూర్తి, దాసరి నాగశత్తిబాబు, పెంకె సిద్దు సాయిరాం, దాసరి మనోహర్, వూట శివ, కోరాడ నాని, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.