మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో అచ్చంపేట సెంటర్లో జనసేన శ్రేణులు రాస్తారోకో

కాకినాడ రూరల్, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్నం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు ఇతర నాయకులపైన పోలీస్ అధికారులు వ్యవహారించిన తీరుని, అక్రమ అరెస్టులను ఖండిస్తూ రూరల్ మండల నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో అచ్చంపేట సెంటర్ లో జనసేన నాయకులు, శ్రేణులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.