కుమ్మకూరి అన్నవరంను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, రాపర్తి గ్రామం నందు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నటువంటి కుమ్మకూరి అన్నవరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటిదగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి అన్నవరంని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన ఆరోగ్యపరమైన సూచనలు సలహాలు అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరం రెడ్డి అమర్, దువ్వ వీరబాబు, దేశనీడి రాజు, దేశినీడి సుధీర్, దేశినీడి బాబి, దేశినీడి లక్ష్మణ్, దేశినీడి సుబ్బారావు, కే ప్రసాద్, వి సతీష్, ఎం నాగు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.