పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురంలో బి పత్తిపాడు గ్రామంలో పలు కుటుంబాలను జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించారు. ముందుగా పిఠాపురం నియోజకవర్గం, బి పత్తిపాడు గ్రామానికి చెందిన జనసైనికుడు బొజ్జ బుల్లి రాజు తల్లి షుగర్ వ్యాధి కారణంగా గత కొంతకాలంగా కాలికి గాయమై బాధపడుతూ సర్జరీ చేయించుకున్నటువంటి బొజ్జ వెంకటలక్ష్మిని వారి స్వగృహం నందు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం జనసైనికుడు, డేరింగ్ అండ్ డైనమిక్ కార్యకర్త బొజ్జ ఐరాజు ఇటీవల బ్యాక్ ఆక్సిడెంట్ కారణంగా కాలికి ఫ్రాక్చర్ అయ్యి ఇంటి దగ్గరే బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి బొజ్జ ఐ రాజు ను తన స్వగృహం నందు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు, బొజ్జ బుల్లి రాజు, బొజ్జ శివ, వూట శ్రీను బాబు మరియు జనసేన పాల్గొనడం జరిగింది.