జనసేన కోసం అహర్నిశలూ పాటుపడుతున్న రాంబాబుకి ద్విచక్ర వాహనాన్నిబహుమతిగా అందించిన డా. సాయి శరత్

దెందులూరు నియోజకవర్గం: తిరగడానికి సరైన వాహనం లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు పాదరక్షలు వేసుకోనని మొక్కుకుని.. జనసేన కోసం అహర్నిశలు పాటుపడుతున్న దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెం గ్రామానికి చెందిన ఏనుగు రాంబాబుకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందించడం జరిగింది.