కరెంట్ షాక్ తో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన డా. విశ్వక్ సేన్ సయ్యద్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం లోని జిరుపాలెం గ్రామానికి చెందిన కంది సత్యారావు(39) కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమం నిర్వాహక సభ్యులు డా. విశ్వక్ సేన్ సయ్యద్ రణస్థలం గవర్నమెంట్ పీ.హెచ్.సి హాస్పిటల్ లో కుటుంబ సభ్యులను ఓదార్చి.. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నడుపూరు శంకరావు, సూర్యనారాయణ, వేణు, చందు, బుజ్జి, తదితరులు జనసేన కార్యకర్తలు పాల్గోన్నారు.