జనం కోసం జనసేన విజయవంతం చేసిన నాయకులకు అభినందనలు తెలిపిన డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బృహత్తరమైన కార్యక్రమం జనం కోసం జనసేన కార్యక్రమం. 10 గ్రామపంచాయతీలోని 10 గ్రామాల్లో జనం కోసం జనసేన కార్యక్రమం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. పాలసముద్రం మండలంలో త్వరలో జనం కోసం జనసేన కార్యక్రమం. వనదుర్గాపురం పంచాయతీలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. వెంగళరాజు కుప్పం వద్ద పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని పునర్నిర్మాణం చేపట్టాలి. ఒక వారంలోపు యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ప్రజా సౌకర్యార్ధం, ప్రయాణికుల సౌకర్యం కోసం ఎలాంటి దీక్షకైనా సిద్ధమని చెప్పిన జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లతీష్, మండల కార్యవర్గ సభ్యులు దేవా, బి.దొరస్వామిరాజు, పంజానాథ, నేఫిల్, పురుషోత్తం, సూర్య, రుద్ర, తులసి, జానకిరామ్, చరణ్, నీలకంఠ పాల్గొన్నారు.