అల్లర్లలో గాయపడిన శేషుని పరామర్శించిన జనసేన నాయకులు

జనసేన పార్టీ అధ్యక్షులు ఉత్తరాంధ్ర పర్యటన సందర్బంగా ఆయనకి స్వాగతం పలకడానికి వైజాగ్ విమానాశ్రయానికి వెళ్లిన తుని నియోజకవర్గం జనసేన నాయకులు శేషుని అక్కడ అల్లరిమూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని సోమవారం వారి స్వగృహానికి వెళ్ళి పరామర్శించి, ఆయనకి దైర్యం చెప్పిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు ఇతర నాయకులు, స్థానికులు.