కేశనపల్లి బీచ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం..

తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి బీచ్  రోడ్డులో కారు తాటి చెట్టును ఢీకొట్టింది. మద్యం మత్తు ఈ ప్రమాదానికి కారణం. దీంతో కారు ముందు భాగం నుజ్జయింది. కారులో వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు అంతర్వేది కి చెందిన సత్యసాయి మణికంఠ18, పలివేల దీవెనకుమార్17.