తెలంగాణలో పిఆర్సి కి ఇసి గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుండి తెలంగాణకు శుభవార్త అందింది. తెలంగాణలో పిఆర్సి ప్రకటనకు ఇసి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పిఆర్సి ప్రకటనపై ఇసి అనుమతిని తెలంగాణ ఆర్థిక శాఖ కోరింది. దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది. పిఆర్సి ప్రకటనతో మాత్రం రాజకీయ లబ్ధి పొందకూడదని ఇసి స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసిన ఉద్యోగ సంఘాలు పిఆర్సి పై విన్నవించాయి. ఈరోజు పిఆర్సి పై అనుమతి లభించడంతో తెలంగాణ ఉద్యోగులందరిలో సంతోషం నెలకొంది.