ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పెద్దలు జనసేనలో చేరిక

ఆత్రేయపురం చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పెద్దలు పేరూరి విశ్వేశ్వరరావు, యలమర్తి సత్యనారాయణ మూర్తి మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో వాడపాలెం కార్యాలయం వద్ద బండారు శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం నాయకులు ముదునూరి సుబ్బరాజు, ఆలమూరు మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, నాగిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.